गुरुवार, मई 07 2026 | 04:22:26 PM
Breaking News
Home / Choose Language / telugu / తిరు ఢిల్లీ గణేశ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

తిరు ఢిల్లీ గణేశ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

Follow us on:

చలనచిత్ర రంగంలో ప్రముఖ  నటుడు తిరు ఢిల్లీ గణేశ్ ఈ రోజు మరణించిన సందర్భంగా  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తిరు ఢిల్లీ గణేశ్ లో గొప్ప నటనా పాటవం మూర్తీభవించిందని, ఆయన తాను పోషించిన ప్రతి పాత్రకు జతపరిచిన ప్రజ్ఞ‌కు, భిన్న తరాల ప్రేక్షకుల మనస్సులను చూరగొన్న సామర్థ్యానికి గాను ప్రేక్షకలోకం ఆయనను ఆప్యాయంగా స్మరించుకొంటుందని శ్రీ మోదీ అన్నారు.

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

చలనచిత్ర రంగంలో ప్రముఖ కళాకారుడు తిరు ఢిల్లీ గణేశ్ గారు మన మధ్య ఇక లేరని తెలిసి ఎంతో బాధ పడ్డాను. ఆయనలో గొప్ప నటనా పాటవం మూర్తీభవించింది. తాను పోషించిన ప్రతి పాత్రలోను కనబరిచిన ప్రజ్ఞ‌కు, భిన్న తరాల ప్రేక్షకుల మనస్సులను చూరగొన్న అభినయ ప్రతిభకు గాను ఆయనను ప్రేక్షకలోకం ఆప్యాయంగా స్మరించుకొంటుంది. రంగస్థలమన్నా కూడా ఆయనకు ఎనలేని మక్కువ ఉండేది. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి.’’

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

55వ ఇఫీలో ముగింపు చిత్రం ‘డ్రై సీజన్’

శ్రీ బోదాన్ స్లామా దర్శకత్వంలో శ్రీ పీటర్ ఓక్రోపెక్ నిర్మించిన చలనచిత్రం ‘డ్రై సీజన్’ (మొదట దీనికి ‘సుఖో’ అని …